Sunday, 13 November 2016

ఎమ్మెల్యే రోజా ప్రశ్నకు బిక్కమొహం వేసిన బ్యాంకు మేనేజర్!

పుత్తూరు: పెద్దనోట్ల రద్దుతో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా తిప్పలు తప్పలేదు. నగదు మార్పు కోసం చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఎస్‌బీఐ బ్యాంకుకు రోజా వెళ్లారు. సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడ్డారు. అయితే బ్యాంకులో నగదు కొరత ఉందని తెలియడంతో నేరుగా బ్యాంకు మేనేజర్‌ దగ్గరికి వెళ్లి సామాన్య ప్రజల తరపున మాట్లాడారు. ‘పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది కదా.. దానికి తగ్గట్లుగా మీరు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు?’ అని రోజా ప్రశ్నించారు. రోజా ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక బ్యాంకు మేనేజర్ బిక్కమొహం వేశారు. సామాన్యుల తరపున ఎమ్మెల్యే స్థాయిలో రోజా ప్రశ్నించేసరికి బ్యాంకు మేనేజర్ నీళ్లు నమిలారు. ముందస్తు చర్యలు లేకుండా రూ. 500, 1000 నోట్లను ప్రభుత్వం రద్దు చేయడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోజా అన్నారు. ప్రజలందరూ పనులన్నీ మానుకొని బ్యాంకుల దగ్గరే పడిగాపులకాస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం చేసేది మంచి పనే అయినా.. పక్క ప్రణాళికతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేసుంటే బాగుండేదని రోజా అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment